బ్రహ్మగారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
నారదా, ఈశ్వరుడు మాయకు అధిపతి. దాని సంగతి దాన్ని సృష్టించిన ఆయన కన్నా బాగా ఎవరికి తెలుసు మరి. ఈశ్వరుడు మాయను సృష్టించటంలో ఆయన సంకల్పం అది తన క్రీడకు ఒక సాధనంగా ఉండాలని. కావాలనే ఆయన ఆ మాయతో సంబంధం పెట్టుకున్నాడు. ఇది దైవ యోగం అన్నమాట. ఎందుకంటే సృష్టిలో ఇతరమైన వాటికి మాయతో సంబంధం కేవలం కర్మానుగుణంగా ఉంటుంది. ఇది భగవంతుడు స్వయంగా ఏర్పరచుకున్న మాయా సంబంధం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ దైవయోగం లేకపోతే అసలు సృష్టే లేదు సుమా. అప్పుడు జీవులూ, కర్మమూ, జన్మచక్రమూ వంటివి ఏమీ ఉండేవే కావు. ఈ దైవయోగం కారణంగా కర్మస్వరూపుడైన జీవుడు, కాలము, స్వభావం అనేవి ఏర్పడ్డాయి. పరమాత్మ వీటిని విశేంగా వృధ్ధి చేయాలని సంకల్పించాడు.
ఈ మూడింటినీ మనం లోకోక్తిగా కూడా చెబుతూ ఉంటాం చూడండి. కాలం కలసి వచ్చిందనీ/కలసి రాలేదనీ, ఫలానా వాడి స్వభావం అంతే అని, అంతా వాడి కర్మ అనీ ఇలాగ. ఇవన్నీ మాయా జనిత మైన వ్యవహారాలు అన్నమాట.
ఈశ్వరుడు మహత్ అనే దాన్ని సృష్టించి దానిలో తన అంశను ప్రవేశపెట్టాడు. కొందరి మతంలో ఈశ్వరుడు మహత్తులో ప్రవేశించాడు. ఇది అంత ఉచితంగా తోచదు. ఎందు కంటే, శ్రీకృష్ణుడు స్వయంగా సమస్త సృష్టి యొక్క తేజస్సూ నాలో శతాంశం కూడా కాదు అని చెప్పాడు. దీనిని బట్టి సృష్టిలో భగవంతుడు తన అంశను మాత్రమే ఉంచాడనుకోవటం ఉత్తమం. మహత్తుకు ఈశ్వరాంశ సంయోగం వలన కాలమూ, ఈ కాలం నుండి త్రిగుణాలూ జనించాయి. ఈ త్రిగుణాలు అనబడే సత్వము, రజస్సు, తమస్సు, కాలం కారణంగా వివిద నిష్పత్తుల్లో కలవటం కూడా సంభవించింది. ఈ త్రిగుణాల్లో మార్పుకి కారణం స్వభావం. (అంటే అవి నిలకడగా ఒకలా ఉండలేక పోవటం వాటి స్వభావం అన్నమాట). ఈ గుణాల్లో వివిధ వైషమ్యాల నుండే కర్మరూపమైన సమస్త సృష్టీ ఏర్పడింది.
మహత్తత్త్వాన్ని భగవంతుడు ఆవేశించటం కారణంగా దానినుండి అహంకారం జన్మిస్తుంది. ముందుగా తమోగుణం ప్రాధాన్యత వహించి సత్వరజో గుణాలని విప్పారుకొనేటట్లు చేయటం వలన ఈ అహంకారం ఏర్పడుతోంది. ఇది సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలని మూడురకాలుగా ఉంటుంది. సాత్వికాహంకారం జ్ఞానశక్తి. రాజసికాహంకారం ద్రవ్యనిర్మా ణం చేసే శక్తి. తామసికాహంకారం క్రియాశక్తి గా తెలుసుకోవాలి.
తామసికాహంకారం వలన పంచభూతాలు జన్మిస్తున్నాయి. మొదట జన్మించినది ఆకాశం. దీని గుణం శబ్దం. అంటే ప్రజ్ఞకు గోచరించటం ఆకాశ గుణం.
ఆకాశం నుండి వాయువు జన్మిస్తున్నది. దీనికి శబ్దము,స్పర్శ అని రెండు గుణాలు. ఈ వాయువే దేహములలో స్పందన కలిగించేది. దీని వలన శరీరంలో ఓజస్సు, సహస్సు, బలము అనే శక్తులు కలుగుతున్నాయి. ఈ వాయుభూతమే శరీరంలోఇంద్రియాలకూ మనస్సుకూ కలయిక కలిగించేది.
వాయువు నుండి తేజస్సు పుడుతున్నది. దీనికి శబ్దము, స్పర్శము, రూపము అని మూడు గుణాలు.
తేజస్సు నుండి జలము పుడుతున్నది. దీని శబ్దము, స్పర్శము, రూపము, (రసము)రుచి అనేవి నాలుగూ గుణాలు.
జలము నుండి పృధ్వి పుడుతున్నది. దీనికి శబ్దము, స్పర్శము, రూపము, రుచి, (గంధము)వాసన అనే ఐదూ గుణాలు.
ఇలా పంచభూతాలూ తామసాహంకారం నుండి జన్మిస్తున్నాయి. తామసికాహంకారాన్ని భూతాది అంటారు. అంటే పంచభూతాలకూ ఇది మొదలు అన్నమాట. మొదట గుణం పుట్టి తరువాత ద్రవ్యం జన్మిస్తుంది కదా. అలాగే తామసికాహంకారంతో మొదట పంచభూతాల గుణాలూ, ఆ పిమ్మట పంచభూతాలూ జన్మించాయని అర్థం చేసుకోవాలి.
రాజసికాహంకారం నుండి మనస్సు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన బడే పది ఇంద్రియాలూ జన్మిస్తున్నాయి. సాత్వికాహంకారం వలన జన్మించిన ఈ క్రింది దేవతలు రాజసికాహంకారం వల్ల పుట్టిన ఇంద్రియాలకు అధిపతులు అవుతున్నారు,
మనస్సుకు అధిదేవత చంద్రుడు.
(చెవి) శ్రోత్రేంద్రియానికి అధిష్టాన దేవత దిక్కు.
(చర్మం) చర్మేంద్రియానికి అధిష్టాన దేత వాయువు.
(కళ్ళు) చక్షురింద్రియానికి అధిష్టాన దేవత సూర్యుడు.
(నాలుక) జిహ్వేంద్రియానికి అధిష్టాన దేవత ప్రచేతసుడు.
(ముక్కు) నాసేంద్రియానికి అధిష్టాన దేవతలు అశ్వినీ దేవతలు.
(చేతులు) హస్తములకు అధిష్టాన దేవత ఇంద్రుడు.
(పాదాలు) పాదములకకు అధిష్టాన దేవత విష్ణువు.
(విసర్జన) పాయువుకు అధిష్టాన దేవత మిత్రుడు.
జననేంద్రియాలకి అధిష్టాన దేవత ప్రజాపతి.
ఇంకా బుధ్ది, ప్రాణము అనేవి కూడా సాత్వికాహంకారం నుండే జన్మించాయి. ఈ బుధ్ధి అనేది అంతఃకరణ చతుష్టయంలో ఒకటి.
ఈ మూడు రకాల అహంకారాల్లో రాజసికాహంకారం సృష్టిలో సకలద్ర్వవ్యానికి మూలం. రాజసికాహంకారం సృష్టిలో సకలక్రియలకూ మూలమైనది. సాత్వికాహంకారం కేవలం జ్ఞానస్వరూపమైనది. వీటి నుండి,పంచ జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు, అధిష్టాన దేవతలూ పంచ భూతములు మనసు అన్నీ కలిపి 25 తత్త్వాలు ఏర్పడుతున్నాయి.
ఇవన్నీ కలిస్తే శరీరం అనే స్థూల రూపం ఏర్పడుతుంది. కాని అలా కలవటాని వీటికి సామర్థ్యం సరిపోదు. ఆ కలయికకు తగిన శక్తిని భగవంతుడే సమకూర్చుతున్నాడు. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఆకారం ఒక అండంగా ఉంది. దానికే బ్రహ్మాండం అని పేరు. పంచభూతాల్లో చలన శక్తి ఉన్న జలం దీన్ని ఆవరించింది. దీనికే మూలజలం, ప్రకృతిజలం అని పేర్లు. పరమాత్మ ఈ అండంలో ప్రవేశించి దానిని పగులగొట్టాడు. ఇలా ప్రవేశించిన పరమాత్మకే బ్రహ్మ అని సంకేతం. ఆయన ప్రేరేపించగా పగిలిన అండంలోంచి ఆవిర్భవించినది ఆ 25తత్త్వాలతో కూడిన ఆయన స్వరూపమే - దానినే విరాట్ స్వరూపం అంటాము. ఇలా పంచవింశతి తత్త్వాలకీ జీవాన్ని ఇచ్చిన ఆయన స్వరూపం ఆధారంగానే మిగతా సృష్టి అంతా జరిగింది. ఈ బ్రహ్మాండం నుండి పుట్టిన సృష్టికి కూడా బ్రహ్మాండం అనేపేరు.
స ఏవ పురుషస్తస్మాదణ్డం నిర్భిద్య నిర్గతః
సహస్రోర్వఙ్ఘ్రిబాహ్వక్షః సహస్రాననశీర్షవాన్
పరమాత్మ ఇచ్చిన ప్రాణశక్తితో బ్రహ్మండం పగులగొట్టుకుని ఆవిర్భవించిన విరాట్ పురుషుడు అనంతమైన జ్ఞాన, క్రియా, ద్రవ్యశక్తుల ప్రకటనంగా వచ్చాడు. ఈ విరాట్ పురుషుడినే సూత్రగర్భుడు అనీ అనిరుధ్ధుడు అనీ పిలుస్తారు.
నారదా, ఆ విరాట్ పురుషుడి దివ్యవిగ్రహం గురించి చెబుతాను విను అన్నారు బ్రహ్మగారు.
నారదా, ఈశ్వరుడు మాయకు అధిపతి. దాని సంగతి దాన్ని సృష్టించిన ఆయన కన్నా బాగా ఎవరికి తెలుసు మరి. ఈశ్వరుడు మాయను సృష్టించటంలో ఆయన సంకల్పం అది తన క్రీడకు ఒక సాధనంగా ఉండాలని. కావాలనే ఆయన ఆ మాయతో సంబంధం పెట్టుకున్నాడు. ఇది దైవ యోగం అన్నమాట. ఎందుకంటే సృష్టిలో ఇతరమైన వాటికి మాయతో సంబంధం కేవలం కర్మానుగుణంగా ఉంటుంది. ఇది భగవంతుడు స్వయంగా ఏర్పరచుకున్న మాయా సంబంధం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ దైవయోగం లేకపోతే అసలు సృష్టే లేదు సుమా. అప్పుడు జీవులూ, కర్మమూ, జన్మచక్రమూ వంటివి ఏమీ ఉండేవే కావు. ఈ దైవయోగం కారణంగా కర్మస్వరూపుడైన జీవుడు, కాలము, స్వభావం అనేవి ఏర్పడ్డాయి. పరమాత్మ వీటిని విశేంగా వృధ్ధి చేయాలని సంకల్పించాడు.
ఈ మూడింటినీ మనం లోకోక్తిగా కూడా చెబుతూ ఉంటాం చూడండి. కాలం కలసి వచ్చిందనీ/కలసి రాలేదనీ, ఫలానా వాడి స్వభావం అంతే అని, అంతా వాడి కర్మ అనీ ఇలాగ. ఇవన్నీ మాయా జనిత మైన వ్యవహారాలు అన్నమాట.
ఈశ్వరుడు మహత్ అనే దాన్ని సృష్టించి దానిలో తన అంశను ప్రవేశపెట్టాడు. కొందరి మతంలో ఈశ్వరుడు మహత్తులో ప్రవేశించాడు. ఇది అంత ఉచితంగా తోచదు. ఎందు కంటే, శ్రీకృష్ణుడు స్వయంగా సమస్త సృష్టి యొక్క తేజస్సూ నాలో శతాంశం కూడా కాదు అని చెప్పాడు. దీనిని బట్టి సృష్టిలో భగవంతుడు తన అంశను మాత్రమే ఉంచాడనుకోవటం ఉత్తమం. మహత్తుకు ఈశ్వరాంశ సంయోగం వలన కాలమూ, ఈ కాలం నుండి త్రిగుణాలూ జనించాయి. ఈ త్రిగుణాలు అనబడే సత్వము, రజస్సు, తమస్సు, కాలం కారణంగా వివిద నిష్పత్తుల్లో కలవటం కూడా సంభవించింది. ఈ త్రిగుణాల్లో మార్పుకి కారణం స్వభావం. (అంటే అవి నిలకడగా ఒకలా ఉండలేక పోవటం వాటి స్వభావం అన్నమాట). ఈ గుణాల్లో వివిధ వైషమ్యాల నుండే కర్మరూపమైన సమస్త సృష్టీ ఏర్పడింది.
మహత్తత్త్వాన్ని భగవంతుడు ఆవేశించటం కారణంగా దానినుండి అహంకారం జన్మిస్తుంది. ముందుగా తమోగుణం ప్రాధాన్యత వహించి సత్వరజో గుణాలని విప్పారుకొనేటట్లు చేయటం వలన ఈ అహంకారం ఏర్పడుతోంది. ఇది సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలని మూడురకాలుగా ఉంటుంది. సాత్వికాహంకారం జ్ఞానశక్తి. రాజసికాహంకారం ద్రవ్యనిర్మా ణం చేసే శక్తి. తామసికాహంకారం క్రియాశక్తి గా తెలుసుకోవాలి.
తామసికాహంకారం వలన పంచభూతాలు జన్మిస్తున్నాయి. మొదట జన్మించినది ఆకాశం. దీని గుణం శబ్దం. అంటే ప్రజ్ఞకు గోచరించటం ఆకాశ గుణం.
ఆకాశం నుండి వాయువు జన్మిస్తున్నది. దీనికి శబ్దము,స్పర్శ అని రెండు గుణాలు. ఈ వాయువే దేహములలో స్పందన కలిగించేది. దీని వలన శరీరంలో ఓజస్సు, సహస్సు, బలము అనే శక్తులు కలుగుతున్నాయి. ఈ వాయుభూతమే శరీరంలోఇంద్రియాలకూ మనస్సుకూ కలయిక కలిగించేది.
వాయువు నుండి తేజస్సు పుడుతున్నది. దీనికి శబ్దము, స్పర్శము, రూపము అని మూడు గుణాలు.
తేజస్సు నుండి జలము పుడుతున్నది. దీని శబ్దము, స్పర్శము, రూపము, (రసము)రుచి అనేవి నాలుగూ గుణాలు.
జలము నుండి పృధ్వి పుడుతున్నది. దీనికి శబ్దము, స్పర్శము, రూపము, రుచి, (గంధము)వాసన అనే ఐదూ గుణాలు.
ఇలా పంచభూతాలూ తామసాహంకారం నుండి జన్మిస్తున్నాయి. తామసికాహంకారాన్ని భూతాది అంటారు. అంటే పంచభూతాలకూ ఇది మొదలు అన్నమాట. మొదట గుణం పుట్టి తరువాత ద్రవ్యం జన్మిస్తుంది కదా. అలాగే తామసికాహంకారంతో మొదట పంచభూతాల గుణాలూ, ఆ పిమ్మట పంచభూతాలూ జన్మించాయని అర్థం చేసుకోవాలి.
రాజసికాహంకారం నుండి మనస్సు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన బడే పది ఇంద్రియాలూ జన్మిస్తున్నాయి. సాత్వికాహంకారం వలన జన్మించిన ఈ క్రింది దేవతలు రాజసికాహంకారం వల్ల పుట్టిన ఇంద్రియాలకు అధిపతులు అవుతున్నారు,
మనస్సుకు అధిదేవత చంద్రుడు.
(చెవి) శ్రోత్రేంద్రియానికి అధిష్టాన దేవత దిక్కు.
(చర్మం) చర్మేంద్రియానికి అధిష్టాన దేత వాయువు.
(కళ్ళు) చక్షురింద్రియానికి అధిష్టాన దేవత సూర్యుడు.
(నాలుక) జిహ్వేంద్రియానికి అధిష్టాన దేవత ప్రచేతసుడు.
(ముక్కు) నాసేంద్రియానికి అధిష్టాన దేవతలు అశ్వినీ దేవతలు.
(చేతులు) హస్తములకు అధిష్టాన దేవత ఇంద్రుడు.
(పాదాలు) పాదములకకు అధిష్టాన దేవత విష్ణువు.
(విసర్జన) పాయువుకు అధిష్టాన దేవత మిత్రుడు.
జననేంద్రియాలకి అధిష్టాన దేవత ప్రజాపతి.
ఇంకా బుధ్ది, ప్రాణము అనేవి కూడా సాత్వికాహంకారం నుండే జన్మించాయి. ఈ బుధ్ధి అనేది అంతఃకరణ చతుష్టయంలో ఒకటి.
ఈ మూడు రకాల అహంకారాల్లో రాజసికాహంకారం సృష్టిలో సకలద్ర్వవ్యానికి మూలం. రాజసికాహంకారం సృష్టిలో సకలక్రియలకూ మూలమైనది. సాత్వికాహంకారం కేవలం జ్ఞానస్వరూపమైనది. వీటి నుండి,పంచ జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు, అధిష్టాన దేవతలూ పంచ భూతములు మనసు అన్నీ కలిపి 25 తత్త్వాలు ఏర్పడుతున్నాయి.
ఇవన్నీ కలిస్తే శరీరం అనే స్థూల రూపం ఏర్పడుతుంది. కాని అలా కలవటాని వీటికి సామర్థ్యం సరిపోదు. ఆ కలయికకు తగిన శక్తిని భగవంతుడే సమకూర్చుతున్నాడు. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఆకారం ఒక అండంగా ఉంది. దానికే బ్రహ్మాండం అని పేరు. పంచభూతాల్లో చలన శక్తి ఉన్న జలం దీన్ని ఆవరించింది. దీనికే మూలజలం, ప్రకృతిజలం అని పేర్లు. పరమాత్మ ఈ అండంలో ప్రవేశించి దానిని పగులగొట్టాడు. ఇలా ప్రవేశించిన పరమాత్మకే బ్రహ్మ అని సంకేతం. ఆయన ప్రేరేపించగా పగిలిన అండంలోంచి ఆవిర్భవించినది ఆ 25తత్త్వాలతో కూడిన ఆయన స్వరూపమే - దానినే విరాట్ స్వరూపం అంటాము. ఇలా పంచవింశతి తత్త్వాలకీ జీవాన్ని ఇచ్చిన ఆయన స్వరూపం ఆధారంగానే మిగతా సృష్టి అంతా జరిగింది. ఈ బ్రహ్మాండం నుండి పుట్టిన సృష్టికి కూడా బ్రహ్మాండం అనేపేరు.
స ఏవ పురుషస్తస్మాదణ్డం నిర్భిద్య నిర్గతః
సహస్రోర్వఙ్ఘ్రిబాహ్వక్షః సహస్రాననశీర్షవాన్
పరమాత్మ ఇచ్చిన ప్రాణశక్తితో బ్రహ్మండం పగులగొట్టుకుని ఆవిర్భవించిన విరాట్ పురుషుడు అనంతమైన జ్ఞాన, క్రియా, ద్రవ్యశక్తుల ప్రకటనంగా వచ్చాడు. ఈ విరాట్ పురుషుడినే సూత్రగర్భుడు అనీ అనిరుధ్ధుడు అనీ పిలుస్తారు.
నారదా, ఆ విరాట్ పురుషుడి దివ్యవిగ్రహం గురించి చెబుతాను విను అన్నారు బ్రహ్మగారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి